రథ సారథి, మిర్యాలగూడ :
స్థానిక నవజీవన్ హైస్కూల్ లో శనివారం నాడు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టౌన్ -2 పోలీస్ ఇన్స్పెక్టర్ సురేష్ విచ్చేశారు. వారి చేతులు మీదుగా నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అదే విధంగా న్యూ ఇయర్ కేకే కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్ లు అతిగా వాడవద్దని,నేర ప్రవృత్తి నీ అలవరచుకోవద్దని హితవు పలికారు.
ఈ కార్యక్రమానికి స్కూల్ కరస్పాండెంట్ శ్రీ రామకవచం నాగరాజు అధ్యక్షత వహించారు. ప్రిన్సిపల్ విజయ కుమారీ, డైరెక్టర్ నాగమణి పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు వాజిద్, పురుషోత్తం రెడ్డి,శ్రీధర్,శ్రీనాథ్, పాపయ్య, వెంకటేశ్వరలు, రామారావు,పద్మ,సరస్వతి,హైమవతి,అరుణ,ఆసియా,మహేశ్వరి, విజయలక్ష్మి, అర్పిత, తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్దులకు బహుమతులు అందచేశారు.

Prev Post
Next Post