మహా సభలకు తరలి వెళ్లిన జర్నలిస్టులు
రథసారథి,మిర్యాలగూడ,
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో నిర్వహించే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ – (143 )ద్వితీయ రాష్ట్ర మహాసభలు , ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) 10వ ప్లీనరీ సభ హైదరాబాద్ కు మిర్యాలగూడ నుంచి ఆదివారం భారీగా జర్నలిస్టులు తరలి వెళ్లారు. మిర్యాలగూడ యూనియన్ నాయకులలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి అస్లం, జిల్లా నాయకులు మల్లె నాగిరెడ్డి, అన్నేబోయిన మట్టయ్య, బొంగరాల మట్టయ్య, విరిగాని లక్ష్మణ్, రమేష్ నాయక్, వేణు, బాలాజీ, సతీష్, నాసరుద్దీన్, రఫీ, మంద లక్ష్మణ్, సుదర్శన్, షేక్ మౌలాలి, డి వెంకటేశ్వర్లు, సైదులు, సురేందర్, సందీప్, కృష్ణ ప్రసాద్, కాజా. నక్క శ్రీనివాస్. నాగయ్య లతో బాటు పలువురు జర్నలిస్ట్ లు నాలుగు వాహనాలలో తరలి వెళ్లారు.