వైకుంఠ ధామ నిర్మాణ పనులకు శంకుస్థాపన
రథసారథి, మిర్యాలగూడ:
మిర్యాలగూడ పట్టణంలోని షాబు నగర్ నందు రూ. 5.50 కోట్ల రూపాయల నిధులతో నూతన వైకుంఠ ధామ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ తో కలిసి మంగళవారం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు శంకుస్థాపన చేసారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, ప్రజారోగ్య శాఖ ఎస్.ఈ. వెంకటేశ్వర్ రావు, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సాగర్, సీనియర్ నాయకులు అన్నభిమోజు నాగార్జున చారి, బి.ఆర్.ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, బి.ఆర్.ఎస్ పార్టీ పట్టణ ఉపాద్యక్షులు బాసాని గిరి, బి.ఆర్.ఎస్ పార్టీ పట్టణ యువజన అద్యక్షులు, కౌన్సిలర్ షైక్ జావీద్, బంటు రమేశ్, పునాటి లక్ష్మీనారాయణ, వడ్డేపల్లి శ్రీనివాస్, మాజీద్, మన్నెం లింగారెడ్డి, తిరుమలగిరి వజ్రం, వింజం శ్రీధర్, తిరంశెట్టి కోటేశ్వర్ రావు, మున్సిపల్ డి. ఈ. సాయిలక్ష్మి, యర్రబోతు సంజీవ రెడ్డి, షైక్ నాగుల్ బాబా, షైక్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.