రాష్ట్రపతి ప్రసంగాన్ని టిఆర్‌ఎస్‌ ‌బహిష్కరణ

పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాల తొలి రోజు నుంచే టీఆర్‌ఎస్‌ ‌నిరసనలు మొదలు పెట్టారు. సీఎం కేసీఆర్‌ ‌నిర్దేశం మేరకు పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్‌ఎస్‌ ఎం‌పీలు బహిష్కరించారు. రాష్ట్రం పట్ల కేంద్రం వైఖరికి నిరసనగా రాష్ట్రపతి ప్రసంగానికి ఎంపీలు దూరంగా ఉన్నారు. సాయంత్రానికి గులాబీ పార్టీ ఎంపీలు ఢిల్లీ చేరుకున్నారు. విభజన హాలు, ఆర్థిక సంఘం సిఫారసులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ ‌నిధులు, జీఎస్టీ నిధులు సహా 23 అంశాలపై పోరాడాలని ఎంపీలకు సీఎం కేసీఆర్‌ ‌దిశానిర్దేశం చేశారు.

బడ్జెట్‌లో తెలంగాణకు సరైన కేటాయింపులు లేకపోతే పార్లమెంట్‌లో నిరసనలు కొనసాగించాలని నిర్ణయించారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలపై పార్లమెంటు లోపలా బయటా పోరాడాలని టీఆర్‌ఎస్‌ ఎం‌పీలు నిర్ణయించుకున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం కేంద్రంపై టీఆర్‌ఎస్‌ ‌తీవ్ర ఒత్తిడి తీసుకురానుంది.

Post bottom

Leave A Reply

Your email address will not be published.