Hyderabad

మల్కాజ్‌గిరి ఆనంద్‌బాగ్ వేంకటేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు.. 59 రోజుల్లో రూ.3.87 లక్షల ఆదాయం

మల్కాజ్‌గిరి, జూలై 16: మల్కాజ్‌గిరి ఆనంద్‌బాగ్‌లోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఎండోమెంట్స్ పర్యవేక్షణ అధికారి మోహన్‌రెడ్డి సమక్షంలో జరిగిన ఈ లెక్కింపులో గత 59 రోజుల వ్యవధిలో హుండీ ద్వారా రూ.3,87,746 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) ఏ.బీ. రవీంద్రరెడ్డి తెలిపారు.

మల్కాజ్‌గిరి, జూలై 16: మల్కాజ్‌గిరి ఆనంద్‌బాగ్‌లోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఎండోమెంట్స్ పర్యవేక్షణ అధికారి మోహన్‌రెడ్డి సమక్షంలో జరిగిన ఈ లెక్కింపులో గత 59 రోజుల వ్యవధిలో హుండీ ద్వారా రూ.3,87,746 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) ఏ.బీ. రవీంద్రరెడ్డి తెలిపారు.

హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అర్చకులు ముడుంబై వెంకట రమణాచార్యులు, డా. తులసి వెంకట రమణాచార్యులు, జూనియర్ అసిస్టెంట్ సండ్ర సుధాకర్, ఆలయ అభివృద్ధి కమిటీ మాజీ సభ్యులు సానాధి శంకర్, హేమంత్ కుమార్, సంజయ్ కుమార్, రత్నాకర్తో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.

ఆలయ అభివృద్ధి, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు భక్తులు అందిస్తున్న విరాళాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఈ సందర్భంగా ఆలయ అధికారులు పేర్కొన్నారు. హుండీ లెక్కింపు ప్రక్రియను ఎండోమెంట్స్ శాఖ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button