Sangareddy

సంగారెడ్డిలో తెలంగాణ స్టూడెంట్‌ ఫౌండేషన్‌ జిల్లా కార్యాలయం ప్రారంభం

-విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాం

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 7 (రథసారథి న్యూస్): తెలంగాణ స్టూడెంట్‌ ఫౌండేషన్‌ (టీఎస్‌ఎఫ్‌) సంగారెడ్డి జిల్లా కార్యాలయాన్ని నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విద్య, సేవ, సమానత్వం, నాయకత్వం, నైపుణ్యం, ఐక్యత, బాధ్యత, పారదర్శకతను ప్రధాన విలువలుగా తీసుకుని సంస్థ పనిచేస్తుందని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణలో ప్రతి విద్యార్థికి విద్యావకాశం కల్పించడం, యువతకు సరైన దిశానిర్దేశం చేయడం, సమాజ సేవలో విద్యార్థులను భాగస్వాములను చేయడం తమ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.

విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు పుస్తకాలు, విద్యా సామగ్రి, అవసరమైన సహకారం అందించడంతో పాటు ఉపకార వేతనాలపై సమాచారం, విద్యా మార్గదర్శకత్వం కల్పిస్తామన్నారు. ఉన్నత విద్య, పోటీ పరీక్షలు, ఉద్యోగ అవకాశాలు, వివిధ వృత్తి మార్గాలపై అవగాహన కల్పించేందుకు మార్గదర్శక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

అలాగే సమాచార సాంకేతిక నైపుణ్యాలు, సంభాషణా నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, ఉపాధికి అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. రక్తదాన శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ, విద్యా సహాయం వంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వాములను చేస్తామని తెలిపారు. విద్యార్థులకు డిజిటల్‌ అక్షరాస్యత, సైబర్‌ భద్రత, కృత్రిమ మేధస్సు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించడంతో పాటు క్రీడలు, సాహిత్యం, విజ్ఞానశాస్త్రం, సాంకేతిక రంగాల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులను గుర్తించి ప్రోత్సహిస్తామని నిర్వాహకులు తెలిపారు. యువతలో సేవాభావం, క్రమశిక్షణ, సమానత్వం, సామాజిక బాధ్యత, బాధ్యతాయుత పౌరసత్వ విలువలను పెంపొందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button