Hyderabad

త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్‌ఖడ్ మృతి.. దర్యాప్తు ప్రారంభించిన అధికారులు

త్రిపుర రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అనురాగ్ ధన్‌ఖడ్ మృతి రాష్ట్ర పోలీసు శాఖలో విషాదాన్ని నింపింది

అగర్తలా: జూలై 20 (రథసారథి న్యూస్):త్రిపుర రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అనురాగ్ ధన్‌ఖడ్ మృతి రాష్ట్ర పోలీసు శాఖలో విషాదాన్ని నింపింది. ఆయన తన కార్యాలయ ప్రాంగణంలోని బాత్రూంలో తుపాకీ గాయాలతో మృతిచెందినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఘటన అనంతరం అనురాగ్ ధన్‌ఖడ్ భౌతికకాయాన్ని పోస్టుమార్టం కోసం అగర్తలాలోని జీబీ (GB) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆసుపత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

ప్రాథమిక సమాచారం ఆధారంగా ఇది ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ, ఘటనకు దారితీసిన పరిస్థితులపై అధికారులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు మరియు దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

త్రిపుర ప్రభుత్వం, పోలీసు శాఖ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button